ముంబై,మే 27:స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆద్యంతం పైకి, కిందకు కదిలాయి. మే నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గడవు ఇవాళ్టితో ముగిసింది. ఇది సూచీల కుదుపుకు కారణమైంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ వేగవంతం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. దీంతో చివరికి లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆల్టైమ్ గరిష్టం వద్ద ట్రేడింగ్ను ముగించింది. ఇక అమెరికాకు సంబంధించిన కీలక డేటా విడుదల కానుండటంతో ప్రపంచ మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం లాభపడ్డాయి.