ముంబై, జూన్ 15: స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో పాటు దేశీయంగా కీలక రంగాల షేర్ల కొనుగోళ్ల పెరుగుదలతో సూచీలు సరికొత్త రికార్డులవైపు పరుగులు పెడుతున్నాయి. ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభంతో ఉండగా…జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 16వేల మార్క్కు చేరుకున్నది. సెన్సెక్స్ 248 పాయింట్లు ఎగబాకి 52,800 వద్ద, నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో 15,878 వద్ద ట్రేడ్ అవుతున్నది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.