ముంబై : ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 2.14 శాతం లేదా 371.60 పాయింట్లు నష్టపోయి, 17,003.15 వద్ద, బిఎస్ఈ సెన్సెక్స్ 2.11 శాతం, 1,227.85 పాయింట్లు క్షీణించి 56,925.07 వద్ద ట్రేడ్ అవుతోంది. ఉక్రెయిన్ – రష్యా, పశ్చిమ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఆందోళన చెందడంతో, బ్యాంకింగ్ స్టాక్లు పడిపోయాయి.
స్టీల్ రంగానికి చెందిన షేర్లు భారీగా పతనమయ్యాయి. మహీంద్ర అండ్ మహీంద్ర షేర్లు రూ.814.60తో ప్రారంభం కాగా రూ.39 మేర నష్టాలు చవిచూశాయి. జేఎస్డబ్ల్యూ షేర్ల ధర గతవారం ముగింపుతో పోలిస్తే రూ.29 తగ్గి రూ.642 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఐసీసీఐ బ్యాంక్ షేరు రూ.32 వరకు తగ్గింది.