న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: అంతర్జాతీయ అమ్మకాల ఒత్తిడికి భారీ నష్టాల్ని చవిచూసిన భారత స్టాక్ సూచీలు.. మంగళవారం కోలుకున్నాయి. సెన్సెక్స్ 514 పాయింట్లు పెరిగి 59,005 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 165 పాయింట్లు లాభపడి 17,562 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఐటీ, ఫైనాన్స్ షేర్లు తోడ్పాటునిచ్చాయి.
ఆ చెల్లింపు కీలకం
చైనా రియల్టీ దిగ్గజం ఎవర్గ్రాండే డిఫాల్ట్ కావొచ్చన్న అంశాన్ని భారత మార్కెట్ డిస్కౌంట్ చేసుకున్నట్లు కన్పిస్తున్నదని రిలయన్స్ సెక్యూరిటీస్ స్ట్రాటజీ హెడ్ బినోద్ మోదీ అన్నారు. 23న బాండ్లకు వడ్డీలుగా ఎవర్గ్రాండే 83 మిలియన్ డాలర్లు చెల్లింపులు చేయాల్సిఉందని, ఆ చెల్లింపులు మార్కెట్కు కీలకం కానున్నాయన్నారు.