ముంబై, జూన్ 29: బ్రిటన్కు చెందిన టైడ్ సంస్థ భారతీయ మార్కెట్లో విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నది. చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలకు ఆర్థిక, పరిపాలనాపరమైన సేవలను అందిస్తున్న టైడ్.. రాబోయే ఐదేండ్లలో దేశీయంగా రూ.1,000 కోట్లకుపైగా పెట్టుబడులకు ముందుకొచ్చింది. సాఫ్ట్వేర్, ప్రోడక్ట్ డెవలప్మెంట్స్, మార్కెటింగ్, ఫీల్డ్ టీమ్స్లో వెయ్యి మందిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలనీ చూస్తున్నది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో 600 మందిని నియమించుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే నగరంలో టైడ్కు ఓ టెక్నాలజీ సెంటర్ ఉన్నది. గతేడాది ఆరంభంలో మొదలైన ఈ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్లో 200 మంది పనిచేస్తున్నారు. కొత్తవారి రాకతో ఈ సంఖ్య 800లకు చేరనున్నది. కాగా, 100 మిలియన్ పౌండ్ల మేర నిధులనూ సమకూర్చుకున్నట్లు టైడ్ ఇండియా సీఈవో గుర్జోధ్పాల్ సింగ్ తెలిపారు. విదేశాల్లో తొలుత భారతీయ మార్కెట్లోనే విస్తరించాలని టైడ్ నిర్ణయించిందన్నారు.