ముంబై, ఆగస్టు 11: దేశీయ ఫిన్టెక్ రంగానికి చెందిన సంస్థలు పెట్టుబడులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతేడాది తొలి ఆరు నెలల్లో 2 బిలియన్ డాలర్లు(15 వేల కోట్లు) ఆకట్టుకున్నాయని కేపీఎంజీ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వీటిలో పినేల్యాబ్స్లోకి వచ్చిన 285 మిలియన్ డాలర్లు, వెంచర్ క్యాపిటల్లోకి 100 మిలియన్ డాలర్లు, క్రెడ్స్(215 మిలియన్ డాలర్లు), రోజర్పే(160 మిలియన్ డాలర్లు), క్రెడిట్బీ(153 మిలియన్ డాలర్లు), ఆఫ్బిజినెస్(110 మిలియన్ డాలర్లు), భారత్పే(108 మిలియన్ డాలర్లు) ఉన్నాయని తెలిపింది.