హైదరాబాద్, మే 5 : ఎనలిటిక్స్ క్లౌడ్ కంపెనీ థాట్స్పాట్ మోడ్రన్ డాటా ఇంటిగ్రేషన్ పరిష్కారాలలో అగ్రగామి సంస్థ డియోట్టాను సొంతం చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ఉత్తర అమెరికా , భారతదేశంలోని 60 మందికి పైగా నూతన ఉద్యోగులు అందనున్నాయి. అంతేకాదు మోడ్రన్ ఎనలిటిక్స్ క్లౌడ్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయనున్నారు. సంస్థ అంతర్జాతీయ ఆర్ అండ్ డీ బృందానికి 25శాతంఅదనపు ఉద్యోగులు అందించడంతో పాటుగా భారతదేశంలోని ఆర్ అండ్ డీ బృందానికి 50శాతం ఉద్యోగులు రానున్నాయి. దీనితో పాటుగా హైదరాబాద్లో సంస్థ తమ సేవలను విస్తరించనుంది. థాట్స్పాట్కు ఇప్పుడు భారతదేశంలో 100 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.
వినియోగదారుల ఆధునిక డాటా స్టాక్లో అత్యుత్తమ సేవలతో థాట్స్పాట్ వేగంగా తమ అనుసంధానతలను విస్తరించేందుకు డియోట్టాతో నూతన అనుబంధం తోడ్పడుతుంది. తమ ఆధునిక క్లౌడ్ నిర్మాణంలో భాగంగా వినియోగదారులు ఎలాంటి అసౌకర్యం లేకుండా థాట్స్పాట్ను సజావుగా రంగంలోకి దింపడంతో పాటు తమ వ్యాపారానికి తక్షణ విలువనూ అందించగలరు. మరీ ముఖ్యంగా, డియోట్టాను సొంతం చేసుకోవడం ద్వారా వెబ్ డెవలపర్లు నిర్మించిన మోడ్రన్ డాటా ప్లాట్ఫామ్స్, ఏఐ, ఎంఐ సేవలు , డాటా అప్లికేషన్లుతో విలీనాలు వేగవంతం కానున్నాయి.
ప్రపంచంలో అగ్రశ్రేణి టెక్నాలజీ ఎనలిస్ట్ సంస్థలలో ఒకటైన సొల్యూషన్స్ రివ్యూ విడుదల చేసిన టాప్ ఫైవ్ డాటా ఇంటిగ్రేషన్ వెండార్లలో ఒకటిగా డియోట్టాకు గుర్తింపు ఉన్నది.. అంతేకాదు, డియోట్టా ప్రతిభావంతులకు ఆధునిక వ్యాపారాలు ఎదుర్కొంటున్న అతి క్లిష్టమైన సవాళ్లను సైతం పరిష్కరించే డాటా ఉత్పత్తులను నిర్మించే అసాధారణ నైపుణ్యం ఉన్నది.డియోట్టా బృందం శక్తివంతమైన, సూక్ష్మ పర్యావరణ వ్యవస్థను సైతం అర్థం చేసుకోవడంతో పాటుగా ప్రక్రియలను నడిపేందుకు నిర్ణయాధికారాన్ని మార్చుకోవడానికి కంపెనీలు తమ డాటాపై ఆదారపడే విధానంలో భాగంగా ఎదుర్కొంటున్న వినూత్నమైన సమస్యలను అర్థం చేసుకుంటుంది’’ అని థాట్స్పాట్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్, సుమీత్ అరోరా అన్నారు.