ఇస్త్రీ చేసి అమ్ముతున్న కేటుగాళ్లు
బాఘ్పత్, మే 9: శవాల మీద కూడా పేలాలు ఏరుకోవడం అంటే ఇదే.. ఉత్తరప్రదేశ్లో బాఘ్పత్లోని శ్మశాన వాటికల్లో కొంత మంది కొవిడ్ మృతుల దుస్తులు, బెడ్షీట్లు ఎత్తుకెళ్లి, ఉతికి, ఇస్త్రీచేసి కొత్తవాటిలా అమ్ముతున్నారు. ఇలా ఎత్తుకెళ్తున్నవారితో స్థానిక వస్త్ర వ్యాపారులు ఒప్పందం చేసుకొని రోజుకు కొంత డబ్బు చెల్లిస్తున్నారు. మృతులకు చెందిన దుస్తులను అమ్ముతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టుచేశారు. వారి దగ్గర నుంచి 520 బెడ్ షీట్లు, 127 కుర్తాలు, 52 చీరలు స్వాధీనం చేసుకొన్నారు.