నవాబ్పేట, మే 20 : మండల కేం ద్రంలోని తాసిల్దార్ కార్యాలయ ఆవరణ లో గురువారం కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్ర వేశపెట్టి ఒక్కో ఆడబిడ్డ పెండ్లికి రూ.లక్షా 116 అందించి అండగా ఉంటున్నారన్నారు. మండలంలో మొత్తం 10మందికి కల్యాణలక్ష్మి పథకం చె క్కులు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ గోపాల్గౌడ్, కోఆప్షన్ సభ్యుడు తాహెర్, ఆర్ఐ జ్ఞానేశ్వర్రెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణ య్య పాల్గొన్నారు.