న్యూఢిల్లీ, జూన్ 3:దేశీయ మార్కెట్లోకి పోలో ఆటోమేటిక్ మోడల్ను విడుదల చేసింది ఫోక్స్వ్యాగన్. ఢిల్లీ షోరూంలో ఈ కారు రూ.8.51 లక్షలకు లభించనున్నది. ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగిన ఈ కారును ఒక్క లీటర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజిన్తో రూపొందించింది. పోలో విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ సరికొత్త వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.