అమరావతి : చిత్తూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఆనందయ్య మందు పంపిణీ ఉద్రిక్తతకు దారి తీసింది. తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల గ్రామంలో స్థానిక సర్పంచ్ ఆనందయ్య మందును ఇంటింటికి పంపిణీ చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని మందు పంపిణీకి అనుమతి లేదని అడ్డుకున్నారు. మందు పంపిణీ చేయొద్దంటూ సర్పంచ్ను, పలువురు గ్రామస్తులను తమదైన శైలిలో హెచ్చరించారు. ప్రభుత్వం, ఆయుష్ కమిషన్, హైకోర్టు మందు పంపిణీకి అనుమతిస్తే అడ్డుకోవడం ఏంటని.? జనం పోలీసులను నిలదీశారు. దీంతో పోలీసులకు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఉన్నతాధికారులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దినట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.