మెదక్ : క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. జిల్లా కేంద్రైమన మెదక్లోని పీఎన్ఆర్ ఇండోర్ స్టేడియంలో మెదక్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింథటిక్ గ్రీన్ మ్యాట్స్ను ఏర్పాటు చేయగా.. గురువారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్లతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండోర్ స్టేడియం అభివృద్ధి కోసం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
మెదక్ మున్సిపాలిటీ నిధుల నుంచి రూ.4 లక్షల 75వేలు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈ నిధులతో పీఎన్ఆర్ ఇండోర్ స్టేడియంలో మూడు కోర్టులకు యోనెక్స్ సింథటిక్ గ్రీన్ మ్యాట్స్, 3 ఉడెన్ కోర్డ్సు మరమ్మతులు, 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారన్నారు. అంతేకాకుండా 50 మంది బ్యాడ్మింటన్ క్రీడాకారులు సేకరించిన రూ.3 లక్షల 40వేలతో జాతీయ స్థాయి పోటీలకు సరిపడా లైటింగ్, గ్యాలరీ, శాశ్వత వేదిక, స్టేడియం లోపల రంగులు వేయడం, 45 అడుగుల ఎత్తు గల నిచ్చెను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
అనంతరం మంత్రి షటిల్ ఆడారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పీఎన్ఆర్ స్టేడియం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ రమేశ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కాగజ్నగర్లో భారీ గుట్కా డంప్ స్వాధీనం
పెద్దపల్లిలో సఖీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొప్పుల
హుజురాబాద్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం
మానవత్వం చాటిన పోలీస్ అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం