యాదాద్రి భువనగిరి, మే 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కొవిడ్ కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యానికే ప్రాధాన్యమిచ్చి లాక్డౌన్ను అమలు చేస్తున్నామని, అయితే ఉదయం 10 గంటల తర్వాత కూడాప్రజలు రోడ్లపై తిరగడం సరైనది కాదన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి ఈనెల 30వ తేదీ వరకు విధించిన లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలని సూచించారు. శుక్రవారం వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అనితారామచంద్రన్,అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, డీసీపీ నారాయణరెడ్డి, డీఎంహెచ్వో సాంబశివరావు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కొవిడ్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, పాజిటివ్ కేసులు, ధాన్యం కొనుగోళ్లు, లాక్డౌన్లో తీసుకుంటున్న చర్యలపై జిల్లాల వారీగా సమీక్షించిన సీఎం కేసీఆర్ యాదాద్రి కలెక్టర్ అనితారామచంద్రన్తో మాట్లాడి పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు.
వైద్యంపై ప్రజలకు భరోసా కల్పించాలి
కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ప్రత్యేకంగా సమీక్షించిన సీఎం కేసీఆర్ మం దులు, ఆక్సిజన్ సరఫరాపై కుణ్ణంగా మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్యం బాధితులకు పూర్తి భరోసా కల్పించాలన్నారు. అవసరమైన పడకలు, ఆక్సిజన్ బెడ్లను సమకూర్చుకోవాలని సూచించారు. ఎక్కడా మందులు, ఇంజెక్షన్ల కొరత లేదని, ఎక్కడైనా అవసరమైతే వెంటనే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకొస్తే తక్షణమే సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని, దవాఖానల ఆవరణలతోపాటు ప్రతి వార్డు శుభ్రంగా ఉండేలా రెండు రోజుల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా కొవిడ్ దవాఖానల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, అవసరమైన చోట వైద్యు లు, పారా మెడికల్ సిబ్బందిని తాత్కాలిక పద్ధతిని నియమించుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని జాతీ య రహదారుల వెంట కొవిడ్ కట్టడికి ప్రత్యేక చర్య లు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి వెంట ఉన్న చౌటుప్పల్ ప్రాంతంలో అధికారులు స్వయంగా వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించాలన్నారు. రెండో విడత జ్వర సర్వేను మరోసారి పకడ్బందీగా చేపట్టి బాధితులకు సాంత్వన చేకూర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ధాన్యం సేకరణను త్వరగా పూర్తి చేయాలి
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ కలెక్టర్కు సూచించా రు. నాలుగైదు రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశిస్తున్నందున రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారని, వెంటనే ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనితారామచంద్రన్ మాట్లాడుతూ 15 రోజు ల్లో కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిచేసేలా చర్యలు తీసు కుంటామని సీఎంకు వివరించారు. వ్యాక్సినేషన్ విషయంలో ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని అమలు చేస్తున్నామని చెప్పిన సీఎం కేసీఆర్.. జిల్లా లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, కూరగాయల వ్యాపారుల వివరాలను సేకరించాలని, వారందరికీ వ్యాక్సినేషన్ చేసే విషయమై ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టనుందని వివరించారు. పల్లెల్లో ప్రజాప్రతినిధులు లాక్డౌన్ను స్వచ్ఛందంగా అమ లు చేస్తున్నారని, పట్టణాల్లో మరింత సమర్థవం తం గా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాస్ హోల్డర్స్ తప్ప ఇతరులు రోడ్లపై కన్పించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు.