లింగంపేట/బాన్సువాడ రూరల్/బీర్కూర్/ మద్నూర్/ పిట్లం/నిజాంసాగర్/బిచ్కుంద, మార్చి23: పీఆర్సీ, రిటైర్మెంట్ వయస్సు పెంపు తదితర వరాలజల్లు కురిపించడంపై ఉద్యోగుల సంబురాలు కొనసాగాయి. ఆయా ప్రకటనలపై హర్షం వ్యక్తం చేస్తూ వివిధ శాఖల ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు మంగళవారం క్షీరాభిషేకం చేశారు. లింగంపేట మండల పరిషత్ ఆవరణలో సీఎం చిత్రపటానికి కార్యాలయ సిబ్బంది క్షీరాభిషేకం చేశారు. ఎంపీడీవో మల్లికార్జున్రెడ్డి, తహసీల్దార్ అమీన్సింగ్ పాల్గొన్నారు. స్థానిక సంస్థలకు నిధులను కేటాయించడంపై సంతోషం వ్యక్తంచేస్తూ కేసీఆర్ చిత్రపటానికి ఎంపీపీ గరీబున్నీసా బేగం క్షీరాభిషేకం చేశారు. ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ పవన్, ఎంపీటీసీ శమీమున్నీసాబేగం, శర్వన్, కళ్యాణి, రూప్సింగ్, నాయకులు నయీం, ఫతియోద్దీన్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ తహసీల్ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. అనంతరం మిఠాయిలు తినిపించుకున్నారు.
కార్యక్రమంలో టీఎన్జీవోస్ బాన్సువాడ యూనిట్ అధ్యక్షుడు వెంకట్, కార్యదర్శి అనిల్, తహసీల్దార్ గంగాధర్, ఏటీవో జగన్, ఎస్టీవో జగదీశ్ పాల్గొన్నారు. బీర్కూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లో టీచర్లు, ఆయాలు సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. మద్నూర్లో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి రిటైర్డ్ ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఉద్యోగులు గంగారాం, రామారావు, ఈశ్వర్, మారుతి తదితరులు పాల్గొన్నారు. బిచ్కుందలోని ఎంపీపీ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ అశోక్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకట్రావ్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. నిజాంసాగర్ మండలంలోని మహ్మద్నగర్ ఉన్నత పాఠశాలలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి హెచ్ఎం సాయిలు, ఉపాధ్యాయులు క్షీరాభిషేకం చేశారు. పిట్లం మండల పరిషత్ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఎంపీపీ కవిత, సర్పంచ్ విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు రాధ, ప్రవీణ, జయంతి, సుమలత, సుజాత పాల్గొన్నారు.