హైదరాబాద్ : కరోనా మహమ్మారి నివారణకు తెలంగాణలో లాక్డౌన్ను పొడిగించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ పొడిగింపునకు సంబంధించి మార్గదర్శకాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. మరో 10 రోజుల పాటు లాక్డౌన్ను పొడిగిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. నేటి వరకు 4 గంటలు మాత్రమే లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉండగా, రేపట్నుంచి ఏడు గంటలకు పెంచారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఒంటి గంట నుంచి 2 గంటల వరకు ఇండ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్డౌన్ను అమలు చేయనున్నారు.