న్యూఢిల్లీ: మానవాళిని వణికిస్తున్న కరోనా మహమ్మారితో వట్టిపోని రంగమే లేదు. ఫ్యాక్టరీలు.. సంస్థలు దెబ్బతిని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కానీ వచ్చే ఏడాది కాలంలో ఉద్యోగాల సునామీ నిరుద్యోగులను చుట్టుముట్టనున్నది. ఒకటి కాదు రెండు కాదు..లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఫ్రెషర్ల తలుపు తట్టనున్నాయి.
విశ్వమారి విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ వర్క్ ఫ్రం హోం, లెర్నింగ్ ఫ్రం హోంకు పరిమితం అయ్యారు. ఐటీ ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హోం సేవలే అందిస్తున్నారు. అంతేకాదు.. ఈ సేవల కోసం సరికొత్త యాప్స్, సర్వీసులు ముందుకు వచ్చాయి.
తత్ఫలితంగా ఈ ఏడాది తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశంలోని మూడు ఐటీ దిగ్గజాలు (టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో) రూ.17,446 కోట్ల లాభాలు గడించాయి. దాంతోపాటు వచ్చే మార్చి లోపు కొత్త ఇంజినీర్లకు 1.05 లక్షల కొలువులు ఇస్తామని వాగ్దానం చేశాయి.
విప్రో, ఇన్ఫోసిస్లు గత పదేండ్లలో తొలిసారి గరిష్ఠ లాభాలు గడించాయి. విప్రో రూ.3,243 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 5,195 కోట్ల లాభాలు పొందాయి. ఇది దశాబ్దిలోనే అత్యధిక లాభాలు గడించిన తొలి త్రైమాసికం అని ఇన్ఫి సీఈవో సలీల్ పరేఖ్ అన్నారు. ఇక మరో దిగ్గజం టీసీఎస్ రూ.9000 కోట్ల లాభాలు పొందింది.
వర్క్ ఫ్రం హోం కల్చర్.. ఐటీ సంస్థలకు గొప్ప అవకాశాలు కల్పించింది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ రంగంలో ఐటీ సంస్థల బిజినెస్ వృద్ధి సాధించింది. కంపెనీలు మంచి డీల్స్ పొందాయి.
ఇన్ఫోసిస్ రూ.19,381 కోట్లు, టీసీఎస్ రూ.60,381 కోట్లు, విప్రో రూ.5,325 కోట్లతో 8 న్యూ డీల్స్ గెలుచుకున్నాయి.
డేటా అనలిటిక్స్, క్లౌడ్, కస్టమర్ ఎక్స్పీరియన్స్, సైబర్ విభాగాలు మున్ముందు ఐటీ రంగ పురోభివృద్ధికి కీలక డ్రైవర్లుగా ఉండనున్నాయని రిలయన్స్ సెక్యూరిటీస్ అనలిస్ట్ సుయోగ్ కులకర్ణి వ్యాఖ్యానించారు. ఐటీ రంగంలో యూరప్లో కన్సల్టెన్సీ విస్తరణ, ఇంజినీరింగ్లో ఆర్&డీ, ఔట్ సోర్సింగ్ షేర్ పెరుగుతున్నది.
సమ్మిళిత ఆర్థిక వృద్ధితోనే అసమానతలకు చెక్ : ఆర్బీఐ గవర్నర్
పెట్రో షాక్ : వాహన విక్రయాలకు ఎదురుదెబ్బ
బ్లాక్ డెవలప్మెంట్ చీఫ్గా భార్య.. అదే ఆఫీసులో భర్త స్వీపర్
కొంపముంచిన సెలబ్రెటీల ట్వీట్లు.. ఒక్కో పోస్టుతో వేల కోట్ల రూపాయలు ఆవిరి !
సొంతింటి కోసం హైదరాబాదీల పరుగులు.. గణనీయంగా పెరిగిన కొనుగోళ్లు