ముంబై: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వెహికిల్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ టెస్లా ఇండియాపై కన్నేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే బెంగళూరులో రిజిస్టర్ కూడా చేసుకుంది. తాజాగా ఇండియాకు సంబంధించి హెడ్క్వార్టర్స్ను కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు ఎకనమిక్ టైమ్స్ వెల్లడించింది. ఆ పత్రిక ప్రకారం ముంబైలోని లోయర్ పారెల్-వర్లీ ప్రాంతంలో టెస్లా తన ఆఫీసును సిద్ధం చేసుకుంటోంది. 40 వేల చదరపు అడుగుల ఏరియాలో టెస్లా ఆఫీస్ ఏర్పాటు కానుంది. కార్ల ఉత్పత్తి మాత్రం కర్ణాటకలోనే జరగనుంది.
కంపెనీలో టాప్ పొజిషన్స్ కోసం గతంలో ఐఐఎం బెంగళూరులో చదివిన వాళ్లను టెస్లా హైర్ చేసుకుంది. మనూజ్ ఖురానా ఇండియా ఆపరేషన్స్ పాలసీ, బిజినెస్ డెవలప్మెంట్ హెడ్గా నియమితుయ్యారు. చార్జింగ్ మేనేజర్గా నిషాంత్ ప్రసాద్ను హైర్ చేసుకున్నారు. టెస్లా మూడు మోడల్స్తో ఇండియాలో తన ఆపరేషన్స్ను మొదలుపెట్టనుంది. గత నెలలోనే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయాలంటూ టెస్లాను ఆహ్వానించారు.