బీజింగ్: సెక్యూరిటీ సమస్యలు తలెత్తడంతో చైనాలో 2.85 లక్షల విద్యుత్ కార్లను రీ కాల్ చేసినట్లు గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా తెలిపింది. వీటిలో క్రూజ్ కంట్రోల్ వ్యవస్థలో సమస్యలు వచ్చాయి. ఈ వ్యవస్థ ఆటోమేటిక్గా ఆన్ అయి నిదానంగా ప్రయాణించే కారు ఒక్కసారిగా వేగం పుంజుకుంటున్నది.
క్రూజ్ కంట్రోల్ వ్యవస్థ ఆటోమేటిక్గా ఆన్ కావడం భద్రతా పరమైన సమస్యగా మారింది. కొన్ని కార్లలో భద్రతా పరమైన తీవ్ర సమస్యలు ఉన్నట్లు చైనా సోషల్ మీడియా వేదిక విబోలో టెస్లా అంగీకరించింది.
మొత్తం మూడు రకాల కార్లలో ఈ సమస్యలు ఉన్నట్లు టెస్లా అధికారులు గుర్తించారు. 2019 డిసెంబర్ నుంచి ఈ నెలలో ఇప్పటి వరకు విక్రయించిన కార్లను రీ కాల్ చేస్తున్నారు. వీటిలో 2,11,256 మోడల్ 3 కార్లు, 38,599 మోడల్ వై కార్లు ఉన్నాయి.
35,665 వరకు మోడల్ 3ఎస్ కార్లు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ కార్లలో క్రూజ్ కంట్రోల్ సాఫ్ట్వేర్ను రిమోట్ ద్వారా టెస్లా అప్డేట్ చేస్తుంది. దీంతో కార్ల యజమానులు.. టెస్లా స్టోర్లకు తీసుకునే అవసరం తప్పుతుంది.