మేడ్చల్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి తన జన్మదినం సందర్భంగా గురువారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్రెడ్డికి మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావును కలిసి దీవెనలు తీసుకున్నారు.
టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి ఎమ్మెల్సీ కవితను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మర్రికి ఎమ్మెల్సీ కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.