హైదరాబాద్: ఆస్ట్రేలియాకు చెందిన టెలీ కమ్యూనికేషన్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ టెల్స్ట్రా.. హైదరాబాద్లోని రహేజా మైండ్ స్పేస్లో ఇన్నోవేషన్ అండ్ క్యాపెబిలిటీస్ సెంటర్ (ఐసీసీ)ను ప్రారంభించింది. మొత్తం 43,372 చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ హైదరాబాద్ కేంద్రం.. స్పెషలైజ్డ్ హై-పెర్ఫార్మెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ హబ్గా పనిచేస్తుంది. అంతేగాక, టెల్స్ట్రా వినియోగదారులకు నేరుగా ఆవిష్కరణలు అందించే డీప్ టెక్నాలజీ కన్జ్యూమర్ ఇంజినీరింగ్ బృందం ఈ కేంద్రంలో పనిచేస్తుంది.
ఈ కంపెనీకి ఇప్పటికే పుణెలో కూడా ఇన్నోవేషన్ అండ్ క్యాపెబిలిటీస్ సెంటర్ (ఐసీసీ) ఉంది. అదేవిధంగా బెంగళూరులో నెట్వర్క్ అండ్ ప్రోడక్ట్ ఇంజినీరింగ్ ల్యాబ్ ఉంది. ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ రెండు కేంద్రాలు భవిష్యత్తులో ఆవిష్కరణ కేంద్రాలుగా మారనున్నాయి. అంతేగాక దేశంలో ప్రతిభా సముపార్జనను అన్ని వైపులకు విస్తరింపజేయాలన్న టెల్స్ట్రా ప్రయత్నాలు మరింత బలోపేతం చేస్తాయి.
టెల్స్ట్రా సంస్థకు చెందిన డిజిటల్ సంబంధ భవిష్యత్తును ముందుకు నడిపించే ఆవిష్కరణలు, ప్రతిభకు టెల్స్ట్రా ఇండియా కేంద్ర స్థానంగా ఉండాలన్నది తమ ఆశయం. భారతదేశంలో తమ విస్తరణ ఇక్కడి వినూత్న పర్యావరణ వ్యవస్థను శక్తివంతం చేయడంలో తమకు ఉన్న నిబద్ధతను తెలియజేస్తున్నది అని టెల్స్ట్రా ఇండియా MD & కంట్రీ హెడ్ NT అరుణ్కుమార్ పేర్కొన్నారు.
హైదరాబాద్, పుణేల్లో తాము నూతనంగా ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ అండ్ క్యాపెబిలిటీస్ సెంటర్లు తమ ఇన్నోవేటివ్ క్యాపెబిలిటీస్ను మరింత బలోపేతం చేస్తాయని, ఈ రెండు సెంటర్లకు సబ్ ఏరియాల్లో ఉన్న స్పెషలైజింగ్ కేంద్రాలు కొత్త ఆవిష్కరణలకు కేంద్రాలు మారుతాయని ఆయన చెప్పారు. అయితే, టెల్స్ట్రా ఐసీసీల్లో పనిచేయడం ద్వారా సాంకేతిక నిపుణులు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), 5G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ సహా ఇతర కొత్త సాంకేతికతల్లో వచ్చే సమస్యలను సులువుగా పరిష్కరించగలుగుతారు.