న్యూఢిల్లీ, జూలై 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.1,353.20 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే సమయంలో నమోదైన రూ.972.30 కోట్ల లాభంతో పోలిస్తే 39.20 శాతం అధికమని పేర్కొంది. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12 శాతం అధికమై రూ.10,197.60 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. డాలర్ రూపంలో కంపెనీ నికర లాభం 42 శాతం ఎగబాకి 183.20 మిలియన్ డాలర్లకు చేరుకోగా, ఆదాయం 14.6 శాతం అధికమై 1,383.60 మిలియన్ డాలర్లకు చేరుకున్నది. గత త్రైమాసికంలో కొత్తగా 5,209 మంది ఉద్యోగులు చేరడంతో మొత్తం సంఖ్య 1,26,263కి చేరుకున్నారు. అన్ని విభాగాల్లో అంచనాలకుమించి రాణించడం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్ణానీ తెలిపారు. డిజిటల్ రంగంపై ప్రధానంగా దృష్టి సారించడంతో అత్యధిక ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కారణమన్నారు.