కంటోన్మెంట్/గౌతంనగర్/నేరేడ్మెట్/వినాయక్నగర్/మల్కాజిగిరి, జూలై 9: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించినప్పుడే హరితహారం విజయవంతమైనట్లు అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న స్పష్టం చేశారు. నియోజకవర్గం పరిధిలోని న్యూ బోయిన్పల్లి ఎయిర్పోర్ట్ రోడ్డులో ఉన్న టీటీడీ పాఠశాల సమీపంలో ఎమ్మెల్యే కంటోన్మెంట్ బోర్డు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో అధికారులు దేవేందర్, మహేందర్తో పాటు బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, పిట్ల నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మల్లికార్జుననగర్ గ్రౌండ్లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, జీహెచ్ఎంసీ నార్త్ జోన్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, కార్పొరేటర్ మేకల సునీతా రాముయాదవ్, డిప్యూటీ కమిషనర్ దశరథ కలిసి మొక్కలు నాటా రు. కార్యక్రమంలో ఏడీ వినోద్, శానిటేషన్, విద్యుత్, వాటర్ వర్క్స్ అధికారులు, కార్పొరేటర్ ప్రేమ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు మేకల రాము , మల్లికార్జుననగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని నేరేడ్మెట్ కార్పొరేటర్ మీనా అన్నారు. శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా డివిజన్ పరిధిలోని కిందిబస్తీలో కార్పొరేటర్ పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షుడు కే. ఉపేందర్రెడ్డి, గోకుల్, సాయికుమార్, చిందం శ్రీనివాస్రావు, కే. రాంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, చెన్నారెడ్డి, జయరాం, జాన్, నారాయణరెడ్డి, రాజు, మోహన్, రాజేశ్, శ్రావణ్, నర్సింహ, శివ, విజయ, పరిమళ తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతిలో సత్వరమే సమస్యలు పరిష్కారం అవుతున్నట్లు కార్పొరేటర్ శాంతి అన్నారు. శుక్రవారం అల్వాల్ డివిజన్లోని కిష్టమ్మ ఎన్క్లేవ్కాలనీలో కార్పొరేటర్ మురుగు నీటి సమస్యను, వెంకటాపురం డివిజన్లోని యాదమ్మనగర్లో కార్పొరేటర్ సబితా డీసీ నాగమణితో కలిసి రోడ్డు పనులను పరిశీలించారు.
ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలో పట్టణ ప్రగతిలో కార్పొరేటర్ వై. ప్రేంకుమార్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో అధికారులు పుష్పలత, శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్ఎఫ్ఐ శ్రీనివాస్, భాస్కర్, శ్రీధర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.