హైదరాబాద్, సెప్టెంబర్30 (నమస్తే తెలంగాణ): రెడ్బెర్రి ఎర్త్ ఫౌండేషన్తో టీ-బ్రిడ్జ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. భారత్, చికాగో ఇన్నోవేషన్ ఎకోసిస్టం మధ్య స్టార్టప్స్ ఎక్సేంజ్కు ఇది అవకాశం కల్పిస్తున్నది. దీని ద్వారా నిర్వహించే మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్స్, సాఫ్ట్ ల్యాండింగ్ ప్రొగ్రామ్స్ స్టార్టప్స్ ఎకోసిస్టాన్ని పెంపొందించనున్నాయి. రెడ్బెర్రి ఎర్త్ ఫౌండేషన్ ఒక లాభార్జన రహిత స్వచ్చంధ సంస్థ. తాజా ఒప్పందంతో భారత్, చికాగో స్టార్టప్స్కి వ్యాపార అవకాశాలు, మార్కెట్ అర్థం చేసుకోవడం, చికాగో-భారత్లోకి స్టార్టప్స్ ప్రవేశించేందుకు మార్గం వంటి అంశాల్లో సాయం అందుతుంది. స్టార్టప్ ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఇరు దేశాలు లబ్ధి పొందనున్నాయి. స్టార్టప్స్కి చికాగోలో కార్యాలయ స్థలం, మౌలిక సదుపాయాల కల్పనలో తోడ్పాటు లభిస్తుంది.