న్యూఢిల్లీ : ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ క్యాంపస్ల నుంచి 40,000 మందికి పైగా ఫ్రెషర్స్ను నియమించుకోనుంది. గత ఏడాది 40,000 మందిని హైర్ చేసిన కంపెనీ తాజాగా మరింత మందిని నియమించుకునేందుకు సన్నాహాలు చేపడుతోందని కంపెనీ అంతర్జాతీయ మానవవనరుల విభాగం చీఫ్ మిలింద్ లక్కడ్ శుక్రవారం వెల్లడించారు. భారత్లో నైపుణ్యాలకు కొదవలేదని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అద్భుత నైపుణ్యాలతో కూడిన మానవవనరులు భారత్లో ఉన్నాయని టీసీఎస్ సీఓఓ ఎన్జీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
భారత్లో టెకీల వేతనాలు హేతుబద్ధంగా ఉన్నాయని, అందుకే దేశీ ట్యాలెంట్పై గ్లోబల్ కంపెనీలు దృష్టిసారించాయని చెప్పారు. భారత్ తరహాలోనే అమెరికా, లాటిన్ అమెరికాలోనూ 2000 మందికి పైగా క్యాంపస్ల నుంచి నియమించుకుంటామని తెలిపారు. ఇక జూన్ క్వార్టర్లో 20,409 మంది ఉద్యోగులను చేర్చుకోగా టీసీఎస్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య ఐదు లక్షలు దాటింది.