న్యూఢిల్లీ: టీసీఎస్ హైదరాబాద్లో కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నది. నిరంతరం నడిచే ఈ కొత్త సెంటర్.. టీసీఎస్ బిజినెస్ 4.0, మెషీన్ ఫస్ట్ డెలివరీ మోడల్ (ఎంఎఫ్డీఎం) ఆధారిత ఆటోమేషన్ ద్వారా పనిచేయనున్నది. కాగా, క్లౌడ్ ఆధారిత ఆర్అండ్డీ డిజిటల్ వర్క్ప్లేస్ నిర్మాణం, నిర్వహణ కోసం టీసీఎస్తో ఎరిక్సన్ భాగస్వామ్యం ఏర్పరచుకున్నది. అయితే ఇందులో హైదరాబాద్ కమాండ్ సెంటర్ కీలకపాత్ర పోషించనున్నట్లు తెలుస్తున్నది. ఎరిక్సన్ డిజిటలైజేషన్ లక్ష్యాల్లో భాగం కావడంపట్ల టీసీఎస్ టెక్నాలజీ వ్యాపారాధిపతి వీ రాజన్న సంతోషం వ్యక్తం చేశారు.