క్యూ4లో రూ.9,246 కోట్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశీయ ఐటీ రంగ దిగ్గజం టీసీఎస్.. ఈ మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.9,246 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. నిరుడు ఇదే వ్యవధితో పోల్చితే 14.9 శాతం అధికం. నాడు రూ.8,049 కోట్ల నికర లాభాన్ని పొందింది. ఈసారి ఆదాయం 9.4 శాతం పెరిగి రూ.43,705 కోట్లకు చేరింది. పోయినసారి రూ. 39,946 కోట్లుగా ఉన్నట్లు సోమవారం సంస్థ తెలియజేసింది. ఇదిలావుంటే సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఒక్కో ఈక్విటీ షేర్కు రూ.15 తుది డివిడెండ్ను ప్రతిపాదించారు.