TCS | ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మరో మైలురాయిని అధిగమించింది. దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ 200 బిలియన్ల డాలర్లు దాటింది. బుధవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో దాని ఎం-క్యాప్ 205 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. ఈ రికార్డు సంపాదించిన భారత తొలి ఐటీ కంపెనీగా నిలిచింది.
50 ఏండ్లు పూర్తి చేసుకున్న టీసీఎస్.. 2004లో స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టయింది. నాటి నుంచి టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ డాలర్లు దాటడానికి 13.5 ఏండ్లు పట్టింది. మరో 100 బిలియన్ల డాలర్లు దాటడానికి మూడున్నరేండ్ల టైం మాత్రమే పట్టింది. టీసీఎస్ ప్రత్యర్థి సంస్థలు యాక్చెంజర్ ఎం-క్యాప్ 216 బిలియన్ల డాలర్లు, ఐబీఎం 122 బిలియన్లు, ఇన్ఫోసిస్ 99 బిలియన్ డాలర్ల ఎం-క్యాప్ కలిగి ఉన్నాయి.
SBI Home Loan | గుడ్న్యూస్.. వడ్డీ రేటు తగ్గింపు.. లోన్ ఎంతైనా ఒకే రేటు
Flying Cars : 2024 నాటికి అందుబాటులోకి ఫ్లయింగ్ కార్లు
టెకీలకు బంపర్ బొనాంజా : క్వార్టర్లీ ప్రమోషన్లు, ప్రత్యేక వేతన పెంపు, అదనపు బోనస్లు!