న్యూఢిల్లీ: ఇప్పటి వరకు వివిధ చైనా సంస్థలు స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించాయి.. ఆ బాటలో మరో చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టీసీఎల్ టెక్నాలజీ తాజాగా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించనున్నది.
మానవాళిని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి దాదాపు ప్రపంచదేశాలన్నీ విధించిన లాక్డౌన్ వల్ల గతేడాది అంతా వ్రుధా అయ్యింది. పనులకు, ఆటలకు, వెకేషన్పై పర్యాటక స్థలాల సందర్శనకూ బ్రేక్లు పడ్డాయి.
కరోనాకు దూరంగా ఉండేందుకు ప్రజలంతా వీడియోలు, సినిమాలు వీక్షించడానికి, గేమ్స్ ఆడటానికి స్మార్ట్ ఫోన్లపై ఆధారపడ్డాయి. దీంతో ప్రపంచ మార్కెట్ ద్రుష్టంతా స్మార్ట్ ఫోన్ల తయారీదారులపైనే పడింది.
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శ్యామ్సంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ వన్ అండ్ టూ పేరిట ఫోల్డబుల్ ఫోన్లను గతేడాది ఫిబ్రవరిలో ఆవిష్కరించింది. మోటోరోలా తన రేజర్ మోడల్ ఫోన్ను ఫోల్డబుల్ స్క్రీన్లో, ఒప్పో ఎక్స్ డివైజ్ను ఆవిష్కరించాయి.
తాజాగా టీసీఎల్ కూడా ఫ్లెక్సిబుల్ స్క్రీన్తో స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించనున్నది. చూడటానికి 10 అంగుళాల టాబ్లెట్లా కనిపించినా దీని స్క్రీన్ 6.87 అంగుళాలు ఉంటుంది. ఇది చూడటానికి శ్యామ్సంగ్ ఎస్-పెన్ మోడల్ను పోలి ఉంటుంది.
టీసీఎల్ రోలింగ్ అండ్ ఫోల్డింగ్ కాన్సెప్ట్తో స్మార్ట్ఫోన్ను రూపొందించింది. ఇప్పటివరకు ప్రపంచమంతా రోలింగ్ లేదా ఫోల్డింగ్ ఫోన్లను మాత్రమే చూసింది. కానీ టీసీఎల్లో రెండు ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.