న్యూఢిల్లీ, జూలై 22: దైనిక్ భాస్కర్ మీడియా గ్రూపు రూ.700 కోట్ల ఆదాయంపై ఆరేండ్లుగా పన్ను చెల్లించడం లేదని కనుగొన్నట్టు ఆదాయం పన్ను శాఖ శనివారం తెలిపింది.
కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై వార్తా కథనాలు రాసిన దైనిక్ భాస్కర్పై గురు, శుక్రవారాల్లో ఐటీ శాఖ దాడులు నిర్వహించింది.
9 నగరాల్లో ఆ గ్రూపుకు చెందిన కార్యాలయాలపై దాడులు జరిగాయి. మరోవైపు, భారత్ సమాచార్కు సంబంధించి రూ.200 కోట్ల ‘లెక్కచూపని’ లావాదేవీలపై దర్యాప్తు జరుపుతున్నట్టు పేర్కొన్నది.