టాటా మోటర్స్ తమ తొలి ఎలక్ట్రిక్ సెడాన్ వాహనాన్ని ఆవిష్కరించింది. ఎక్స్ప్రెస్ బ్రాండ్లో ఎక్స్ప్రెస్-టీ ఈవీ పేరుతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసినట్లు బుధవారం ప్రకటించింది. కనీస ధర రూ.9.54 లక్షలు, గరిష్ఠ ధర రూ.10.64 లక్షలుగా ఉన్నది. ఎక్స్ప్రెస్టీ 165, ఎక్స్ప్రెస్టీ 213 మోడళ్లలో 165-213 కిలోమీటర్ల శ్రేణిలో ఈ కార్లను టాటా అందుబాటులోకి తెచ్చింది. గంటన్నరలోనే 80 శాతం చార్జింగ్ అవుతుంది.