న్యూఢిల్లీ: భారత మొబైల్ ఫోన్ల మార్కెట్లో గత జనవరి-మార్చి త్రైమాసికంలో 5జీ స్మార్ట్ ఫోన్ల విక్రయాలు ఏడుశాతానికి చేరుకున్నాయి. 2021లో 21 శాతం 5జీ స్మార్ట్ ఫోన్ల విక్రయాలు నమోదవుతాయని రియల్ మీ, కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంయుక్త అధ్యయనంలో తేలింది. ఎటువంటి కమర్షియల్ నెట్వర్క్ లేకుండానే సహజసిద్ధంగానే భారత్లో 5జీ ఫోన్ల మార్కెట్ పెరుగుతుందని ఆ అధ్యయనం నిర్ధారించింది.
గత రెండు త్రైమాసికాల్లో అమ్ముడైన ప్రతి ఐదు.. 5జీ స్మార్ట్ ఫోన్లలో ఒకటి 200-299 డాలర్ల విలువ పలుకుతుందని రియల్ మీ & కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. 33 శాతం ఫోన్లు 399 డాలర్లలోపు ఉన్నాయని తెలిపింది.
దక్షిణ కొరియా, చైనా, ఉత్తర కొరియా, యూరప్, జపాన్ వంటి కీలకంగా అభివ్రుద్ధి చెందిన దేశాల్లో 5జీ స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 50 శాతం దాటేశాయి. 2022 చివరికల్లా అమ్ముడయ్యే స్మార్ట్ ఫోన్లలో ప్రతి రెండింట ఒకటి 5జీ ఫోన్ అని ఈ నివేదిక వ్యాఖ్యానించింది.
3జీ ఫోన్లలో నోకియా, 4జీలో శ్యామ్సంగ్ ఆధిపత్యం ప్రదర్శించాయి. కానీ 5జీలో పరిస్థితి వైవిధ్యం కానున్నది. దీర్ఘ కాలికంలో 5జీ స్మార్ట్ ఫోన్ల విక్రయానికి భారత్ వేదికగా నిలుస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
చరిత్రలో ఈరోజు.. తొలి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం
సెంట్రల్ బ్యాంక్, ఐఓబీలో వాటా విక్రయానికి కేంద్రం సన్నాహలు
అన్లాక్ షురూ : మెట్రో రైల్, మార్కెట్లు ఓపెన్
కొవిడ్ చికిత్స నుంచి ఐవర్మెక్టిన్, డాక్సీసైక్లిన్ ఔట్.. సీటీ స్కాన్లూ వద్దు!
దేశంలో ప్రమాదకరమైన కరోనా మరో వేరియంట్ గుర్తింపు
కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్తోనే ఎక్కువ యాంటీబాడీలు!
మళ్లీ అమ్మాయి పుట్టిందని భార్యా పిల్లలను బావిలోకి తోసేసిన భర్త
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఢిల్లీ ఎయిమ్స్లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్
అధిష్ఠానం కోరితే రాజీనామా చేస్తా
జూలై 1 నుంచి బ్యాడ్ బ్యాంక్ ప్రారంభం?! ఎందుకంటే?!
చోక్సీ అప్పగింత డౌటేనా? అసలేం జరిగింది?!
స్వల్పకాలం కార్ల ధరలు స్టేబుల్: ఫోక్స్ వ్యాగన్