న్యూఢిల్లీ : టాటా మోటార్స్ భారత్ మార్కెట్లో న్యూ టిగోర్ ఎలక్ట్రిక్ కారును లాంఛ్ చేసింది. టిగోర్ ఈవీ ఫేస్లిఫ్ట్ వెర్షన్గా ముందుకొచ్చిన ఈ వాహనం ధర రూ 11.99 లక్షలకు (ఎక్స్షోరూం) అందుబాటులో ఉంది. బీఎస్6 టిగోర్ సబ్ కాంపాక్ట్ సెడన్కు అనుగుణంగా న్యూ టిగోర్ ఈవీలో కంపెనీ పలు మార్పులు చేపట్టింది.
మెరుగైన సామర్ధ్యం, లాంగర్ రేంజ్ను ఆఫర్ చేస్తూ కంపెనీ జిప్ట్రన్ టెక్నాలజీని వాడుతూ న్యూ టిగోర్ ఈవీ కస్టమర్లను ఆకట్టుకోనుంది. న్యూ పవర్ట్రైన్ ఫీచర్ను న్యూ టిగోర్లో జోడించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రూ 21,000 టోకెన్ అమౌంట్తో కస్టమర్లు న్యూ టిగోర్ ఈవీని బుక్ చేసుకోవచ్చు.
ఒకసారి చార్జింగ్ చేస్తే ఈ వాహనం 306 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. న్యూ టిగోర్ కేవలం 5.7 సెకండ్లలోనే సున్నా నుంచి 60 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది.