జంషెడ్పూర్: (Tata Steel Bonus) టాటా స్టీల్ సంస్థ తమ ఉద్యోగులకు ఈ ఏడాదికి బోనస్ ప్రకటించింది. గతంలో కన్నా ఎక్కువగా బోనస్ ప్రకంటించింది. ఈసారి అధికారిక యూనియన్ లేకపోవడంతో ఏకపక్షంగా బోనస్ ప్రకటన నిర్ణయం తీసుకున్నారు. టాటా స్టీల్ అనుబంధ సంస్థ అయిన టాటా స్టీల్ యుటిలిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్ (గతంలో జస్కో) సోమవారం సాయంత్రం బోనస్ డబ్బును విడుదల చేసింది. కంపెనీ నిర్వహణ బోనస్ డబ్బును ఒకటి, రెండు రోజుల్లో ఉద్యోగుల బ్యాంక్ ఖాతాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
జస్కోలోని 706 మంది ఉద్యోగులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.6.43 కోట్ల బోనస్ పొందుతారు. జస్కో బోనస్ ఫార్ములా ప్రకారం, 2020 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులకు రూ.6.28 కోట్ల బోనస్ ఇచ్చారు. అయితే, కొవిడ్-19 కాలంలో ఉద్యోగులు విశేషంగా పనిచేసి స్వచ్ఛ భారత్ సర్వే ర్యాంకింగ్, వేస్ట్ వాటర్ రీసైక్లింగ్, టీబీఈఎం, వార్షిక కంపోస్ట్ ఉత్పత్తిలో అత్యుత్తమ స్కోరును ఉత్పత్తి చేయగలిగారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ యాజమాన్యం దాదాపు రూ.15 కోట్లు అదనంగా బోనస్ ఇవ్వడానికి కంపెనీ నిర్ణయించింది.
స్వలింగ వివాహానికి రెఫరెండం, స్విట్జర్లాండ్ ప్రజలు గ్రీన్సిగ్నల్
మన్మోహన్ కాకుండా పవార్ను ప్రధాని చేస్తే బాగుండేది: రాందాస్ అథవాలే
బ్యాడ్ బ్యాంకుకు లక్ష కోట్ల ఫ్రాడ్ లోన్స్.. ఆర్బీఐ అనుమతికి ఎదురుచూపులు
వార్ మ్యూజియంను సందర్శించిన వెంకయ్యనాయుడు
ఎప్పుడో కొన్న షేర్లకు కోట్ల విలువ.. ఇప్పించాలని సెబీని ఆశ్రయించిన బాబు జార్జ్ వలవి
ఆందోళన చేస్తున్న రైతు మృతి.. గుండెపోటుతో అంటున్న పోలీసులు
సరిహద్దులో క్రియాశీలకంగా చైనా.. మాడ్యులర్ కంటైనర్ల ఏర్పాటు
ఉద్యమమే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఊపిరి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..