అదిరిపోయే లుక్లో టాటా సఫారీ.. ధర ఎంతంటే?

ముంబై: కొత్త లుక్లో టాటా సఫారీ ఇండియన్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. సోమవారం ఉదయం 11 గంటలకు సఫారీని లాంచ్ చేస్తున్నట్లు టాటా సంస్థ ప్రకటించింది. గత నెలలో ఈ వెహికిల్ను ఆవిష్కరించిన సంస్థ.. ఈ నెల ప్రారంభం నుంచి రూ.30 వేలకు బుకింగ్స్ కూడా తీసుకుంటోంది. వెహికిల్ను లాంచ్ చేసిన వెంటనే దీని ధరను కూడా ప్రకటించనున్నారు. ఈ ఎస్యూవీ ధర ఎంత అన్నదానిపై కంపెనీ ఇప్పటి వరకూ ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే దీని ప్రారంభ ధరనే రూ.18 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ రేంజ్లో ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎంజీ హెక్టార్ ప్లస్, మహీంద్రా ఎక్స్యూవీ 500, జీప్ కంపాస్లతో సఫారీ పోటీ పడనుంది.
మూడు రంగులు, ఆరు వేరియంట్లు
ఈ కొత్త సఫారీ మొత్తం మూడు రంగుల్లో 9 వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఇందులో ఎక్స్ఈ అనేది బేస్ వేరియంట్. ఇందులో రెండు ఎయిర్ బ్యాగులు, అన్ని డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఇక ఆ తర్వాతి వేరియంట్ అయిన ఎక్స్ఎంలో మల్టీ డ్రైవ్ మోడ్లు, టచ్స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటాయి. ఇక తర్వాతి ఎక్స్టీ మోడల్లో ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్తోపాటు పనోరమిక్ సన్రూఫ్ ఉండనున్నాయి. టాప్ మోడల్ అయిన ఎక్స్జెడ్లో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్స్, 8.8 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్స్క్రీన్, 9 జేబీఎల్ స్పీకర్లు, సబ్వూఫర్, జినాన్ హెచ్ఐడీ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ ఉంటాయి.
తాజావార్తలు
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..
- నేటి నుంచి 60 ఏండ్లు పైబడిన వారికి టీకా
- అబద్ధాల బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి..
- పోలింగ్కు ముమ్మరంగా ఏర్పాట్లు
- వాణీదేవిలోనే పీవీని చూస్తున్నాం..
- విద్వేషాలు రగిల్చేవారికి విద్యావంతులు బుద్ధి చెప్పండి
- లక్ష చెప్పాం..35వేలు ఎక్కువే ఇచ్చాం