న్యూఢిల్లీ : భారత్లో టాటా సఫారి గోల్డ్ ఎడిషన్ టీజర్ను విడుదల చేసిన కంపెనీ తాజాగా లాంఛ్ వివరాలను వెల్లడించింది. రానున్న పండగ సీజన్ నేపధ్యంలో ప్రత్యేక డిజైన్తో ముందుకు రానున్న ఈ ఎస్యూవీని దుబాయ్లో జరిగే ఐపీఎల్ 2021లో ప్రదర్శిస్తారు. ఇక సఫారీ గోల్డ్ ఎడిషన్ (మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్) ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ 21.9 లక్షలు కాగా, ఆటోమేటిక్ గేర్బాక్స్తో కూడిన సఫారి గోల్డ్ ఎడిషన్ రూ 23.18 లక్షలకు అందుబాటులో ఉంటుంది.
వైట్ గోల్డ్, బ్లాక్ గోల్డ్ రెండు కలర్ ఆప్షన్స్లో ఈ ఎస్యూవీ కస్టమర్ల ముందుకు రానుంది. సఫారి వైట్ గోల్డ్ ఎడిషన్ వైట్ కలర్తో పాటు బ్లాక్ రూఫ్, గ్రిల్, ఫాగ్ ల్యాంప్ పరిసరాల్లో గోల్డ్ యాక్సెంట్స్ తో ఆకట్టుకోనుంది. ఎస్యూవీ లోపల డ్యాష్బోర్డ్, గోల్డ్ యాక్సెంట్స్కు బ్లాంక్ మార్బుల్ పినిషింగ్ ఉంటుంది. ఇక వైర్లెస్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆండ్రాయిట్ ఆటో, యాపిల్ కార్ప్లే వంటి ఫీచర్లతో పాటు 8.8 ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, ఏడు ఇంచ్ల టీఎఫ్టీ డిస్ప్లే, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ కస్టమర్లను ఆకట్టుకుంటాయి.
సౌకర్యవంతమైన ఫీచర్లతో పాటు లగ్జరీ అనుభూతిని కస్టమర్లకు అందించే టాటా డీఎన్ఏకు అనుగుణంగా ఈ ఎస్యూవీ స్పెషల్ వెర్షన్గా డిజైన్చేశామని పండుగ సీజన్లో ఈ వాహనం కొనుగోలుదారులను ఆకట్టుకుంటుందని టాటా మోటార్స్ పాసింజర్, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.