న్యూఢిల్లీ : మహింద్ర కేయూవీ 100 నెక్ట్స్, మారుతి ఇగ్నిస్లకు పోటీగా భావిస్తున్న టాటా పంచ్ ఎస్యూవీ బుకింగ్స్ అక్టోబర్ 4 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందుబాటు ధరలో ఎస్యూవీని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న వారిలో టాటా పంచ్ ఆశలు రేకెత్తిస్తోంది. టాటా పంచ్ ప్రీ ఆర్డర్స్ను అనధికారికంగా కొన్ని టాటా డీలర్లు అనుమతిస్తుండగా అక్టోబర్ 4 నుంచి అధికారికంగా టాటా పంచ్ బుకింగ్స్ స్టార్ట్ అవుతాయని చెబుతున్నారు. రూ 5000 టోకెన్ అమౌంట్తో ఈ ఎస్యూవీని బుక్ చేసుకోవచ్చు.
ఇక టాటా పంచ్ ఫీచర్ల విషయానికి వస్తే ఫంకీ డిజైన్, ఎల్ఈడీ ఇండికేటర్లతో కూడిన స్ల్పిట్ హెడ్ల్యాంప్, బానెట్ కింద బ్లాక్ గ్రిల్ రైట్, డ్యూయల్ టోన్ బంపర్, రూఫ్ రెయిల్స్, సైడ్ క్లాడింగ్తో పాటు టాటా నెక్సాన్ ఎస్యూవీలో కనిపించే డ్యూయల్ టోన్ కలర్ థీమ్, పుష్ బటన్ స్టాప్, స్టార్ట్, ఆటోమేటిక్ ఏసీ, టచ్స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టం వంటి ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఇక టాటా పంచ్ ఎస్యూవీ ధర వివరాలు కూడా అక్టోబర్ మొదటి వారంలో వెల్లడికానున్నాయి.