న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: టాటా మోటర్స్ వాణిజ్య వాహనాల ధరలు పెరుగనున్నాయి. అక్టోబర్ 1 నుంచి దాదాపు 2 శాతం పెరుగుతాయని మంగళవారం సంస్థ ప్రకటించింది. పెరిగిన తయారీ ఖర్చుల వల్లే వాహన ధరల్ని పెంచాల్సి వస్తున్నదని తెలిపింది. కాగా, మోడల్, వేరియంట్ ఆధారం గా ధరల పెరుగుదల ఉంటుందని ఈ సందర్భంగా కంపెనీ స్పష్టం చేసింది. వాణిజ్య వాహనాల ఉత్పత్తిలో దేశంలోనే అతిపెద్ద సంస్థగా పేరున్న టాటా మోటర్స్.. ట్రక్కులు, బస్సులతోపాటు తేలికపాటి వాహనాలనూ తయారు చేస్తున్నది.