హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శనివారం తెలిపింది. మహమ్మారి నుంచి 917 మంది బాధితులు కోలుకోగా.. వైరస్ ప్రభావంతో కొత్తగా ఐదుగురు మృత్యువాతపడ్డారని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,31,218కు పెరిగింది. ఇందులో 6,16,769 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 3,725 మంది రోగులు ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,724 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ పేర్కొంది.
రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉందని, రికవరీ రేటు 97.17శాతంగా ఉందని చెప్పింది. ఇవాళ ఒకే రోజు 1,00,632 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు 1,96,94,564 నమూనాలను పరీక్షించినట్లు వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్లో 77, నల్లగొండలో 64, కరీంనగర్లో 55, వరంగల్ అర్బన్లో 47, మంచిర్యాలలో 46, ఖమ్మంలో 44, పెద్దపల్లిలో 37 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వివరించింది.