న్యూఢిల్లీ, ఆగస్టు 18: టాటా మోటర్స్..మరో ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. టిగోర్ ఈవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న రిటైల్ అవుట్లెట్ల వద్ద రూ.21 వేలు చెల్లించి బుకింగ్ చేసుకున్నవారికి ఈ నెల 31 నుంచి ఈ కారును అందచేయనున్నట్లు ప్రకటించింది. కేవలం 5.7 సెకండ్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారులో 26 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ కలిగివున్నది. ఈ బ్యాటరీపై ఎనిమిదేండ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వ్యారెంటీని కూడా ఇస్తున్నది సంస్థ. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో విద్యుత్తో నడిచే వాహనాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొన్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.