ముంబై ,మే 7 : గతేడాది కరోనా మొదలైనప్ప్పటినుంచి భారీగా ఎగిసిపడిన క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ ఆ తర్వాత కొద్దిరోజులకు క్షీణించినప్పటికీ, క్రమంగా కోలుకుంటున్నది. ఓ సమయంలో 64వేల డాలర్లను క్రాస్ చేసిన బిట్ కాయిన్ ఆ తర్వాత 50వేల డాలర్లకు దిగువకు పడిపోయింది. ప్రస్తుతం57వేల డాలర్లను క్రాస్ చేసింది. బిట్ కాయిన్ తాజాగా 7 శాతానికి పైగా ఎగిసినప్పటికీ ఏప్రిల్ 14వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం 64,895.22 డాలర్లతో పోలిస్తే దాదాపు 12 శాతం తక్కువగా ఉంది. ఇక సెకండ్ బిగ్గెస్ట్ క్రిప్టో ఎథేరియం దాదాపు 6 శాతం ఎగిసి 3,430 డాలర్లకు చేరుకున్నది. క్రితం సెషన్తో పోలిస్తే 191.58 డాలర్లు పెరిగింది. ఇటీవలి కాలంలో క్రిప్టోకరెన్సీ క్షీణించినప్పటికీ, మళ్లీ కోలుకుంటున్నది.
గత కొద్దికాలంగా క్రిప్టోకరెన్సీలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో ఇది నిలకడలేనిదనే వాదనలు కూడా ఉన్నాయి. ఏదేమైనా అంతకంతకూ ఎగిసిపడుతున్న క్రిప్టోల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు.బిట్ కాయిన్,ఎథేరియం వంటి క్రిప్టోకరెన్సీలు అందనంత ఎత్తుకు వెళ్లాయి. అయితే కొన్ని క్రిప్టోలు ప్రస్తుతం సామాన్యులు పెట్టుబడి పెట్టే స్థాయిలో ఉన్నాయి. అందులో కార్డానో1.50 డాలర్లు, డోజీకాయిన్ 0.60 డాలర్లు యూనిస్వాప్42 డాలర్లు ఉన్నాయి. చైన్లింక్ 47.58 డాలర్లు వద్ద ఉన్నాయి.