Business
- Feb 01, 2021 , 10:50:47
VIDEOS
బడ్జెట్కు ముందు లాభాల్లోకి దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు

ముంబై: కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. గత వారం మొత్తం నష్టాల్లో కూరుకుపోయిన మార్కెట్లు.. సోమవారం ఉదయం లాభాల బాట పట్టాయి. ఆరంభ ట్రేడ్లో సెన్సెక్స్ 407 పాయింట్లు, నిఫ్టీ 124 పాయింట్లు లాభపడ్డాయి. బీఎస్ఈలో ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాక్, టైటాన్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. వాస్తవానికి బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్లో భారీ ఊగిసలాటలు సహజమని గత అనుభవాలు చెబుతున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని బడ్జెట్ను ఈసారి చూడబోతున్నారని ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటనతో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి.
తాజావార్తలు
- సురభి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలి
- వామపక్షాల ఆందోళన.. పోలీసుల లాఠీచార్జి ..వీడియో
- మేడిన్ ఇండియా వ్యాక్సిన్ తీసుకున్న నేపాల్ ఆర్మీ చీఫ్
- బాలిక డ్రెస్ పట్ల అభ్యంతరం.. స్కూల్ నుంచి ఇంటికి పంపివేత
- పెద్దగట్టు ప్రాశస్త్యాన్ని పెంచిన ఘనత కేసీఆర్దే : మంత్రి జగదీశ్ రెడ్డి
- మోదీకి కొవాగ్జిన్.. కొవిషీల్డ్ సామర్థ్యంపై ఒవైసీ అనుమానం
- ఒప్పో ఫైండ్ ఎక్స్3 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్!
- సీతారాముల కల్యాణానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి
- విద్యార్థులతో కలిసి రాహుల్గాంధీ పుష్ అప్స్, డ్యాన్స్.. వీడియోలు
- నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా ? రేప్ కేసులో సుప్రీం ప్రశ్న
MOST READ
TRENDING