కొందరు అధికారుల తప్పిదాల వలన విద్యార్ధులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీహర్లో జరిగిన కొన్ని సంఘటనలు ఇందుకు సాక్ష్యం. గతంలో ఓ విద్యార్థి దరఖాస్తు ఫారంలో.. తండ్రి పేరు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మిగా పడింది. తల్లి పేరు సన్నీ లియోన్గా పేర్కొన్నారు. ఇక అడ్రెస్ను ముంబై రెడ్ ఏరియాగా ముద్రించారు. అంతకుముందు జూనియర్ ఇంజనీర్ పరీక్షల్లో సన్నీ లియోన్ను టాపర్గా ప్రకటించారు.
ఈ క్రమంలో బీహార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ అధికారులలో మార్పు రావడం లేదు. బీహార్కు చెందిన రిషికేశ్ అనే యువకుడు ఇటీవలస్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (STET) రాశాడు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో అతడికి మంచి మార్కులే వచ్చాయి. మ్యాథ్స్ పేపర్ 1లో 150 కి 77.70, మ్యాథ్స్ పేపర్ 2లో 150కి 95.45 మార్కులు వచ్చాయి. కాని మార్క్ షీట్లో మాత్రం అతని ఫొటోకి బదులు వేరే వారి ఫొటో ప్రత్యక్షం అయింది. ఆ ఫొటో మరెవరిదో కాదు మలయాళ నటి అనుపమది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోలేదట. అయితే మెమో వైరల్ కావడంతో బీహార్ విద్యాశాఖ తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు. ఈ తప్పిదంపై దర్యాప్తునకు ఆదేశించామని బీహార్ విద్యాశాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు.