‘కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందించడానికి నిరంతరం తాపత్రయపడతాను. నా సినీ జీవితం మొత్తం ప్రయోగాలు చేస్తూనే ఉంటా’ అని అన్నారు నాగార్జున. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వైల్డ్డాగ్’. అహిషోర్ సాల్మన్ దర్శకుడు. నిరంజన్రెడ్డి, అన్వేష్రెడ్డి నిర్మించారు. ఏప్రిల్ 2న విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘సినిమాలో చేసిన విజయ్వర్మ పాత్ర నన్ను అమితంగా ఆకట్టుకున్నది. మంచి భర్త, తండ్రి, టీమ్లీడర్, మానవీయ విలువలు ఉన్న వ్యక్తిగా విభిన్నంగా నా పాత్ర సాగుతుంది. దేశాన్ని అమితంగా ప్రేమిస్తూ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడే వ్యక్తిగా కనిపిస్తా. ఎవరికి భయపడని తత్వంతో సాగుతుంది.
నా నిజజీవిత లక్షణా లకు దగ్గరగా ఉన్న పాత్ర ఇది. కొత్త దర్శకులు, ఔత్సాహికులైన ప్రతిభావంతులతో పనిచేయడం వల్లే నవ్యతతో ఆలోచించ గలుగుతున్నా. ఒకే తరహా పాత్రలు, సినిమాల్లో నన్ను నేను చూసుకోలేను. నాకు బోర్ కొట్టే విషయాలకు దూరంగా ఉంటాను. నేను చేసిన సినిమాల్లో శక్తివంతమైన పాత్ర ఇది. నిర్మాత నిరంజన్రెడ్డిని నమ్మే ధైర్యంగా ఈ సినిమాను నేను చేశా. ఎంతో ప్రేమతో ఈ సినిమా చేశాం. ప్రయోగాత్మక సినిమా కాదు. కమర్షియల్ హంగులతో విభిన్నంగా ఉంటుంది. లాక్డౌన్ పూర్తవ్వగానే మనాలీలో షూటింగ్ చేయడానికి వెళ్లాం. చాలా రోజుల తర్వాత షూటింగ్లో పాల్గొన డటంతో కంట్లో నీళ్లొచ్చాయి. మనం చేసే పనిని ప్రేమిస్తే సినిమాలు ఎంత బాగా వస్తాయో ఈ సినిమాతో తెలిసింది’ అని తెలిపారు.
నిరంజన్రెడ్డి మాట్లాడుతూ ‘అహిషోర్ సాల్మన్ ఈ కథ చెప్పినప్పుడు తెలుగులో ఇలాంటి సినిమా తీయడం సాధ్యమవుతుందా అనిపించింది. ప్రేక్షకులు ప్రయోగాత్మక సినిమా అనుకునే అవకాశముందని భయపడ్డాం. నాగార్జున గారు అంగీకరిస్తేనే ఈ సినిమా చేయాల నుకున్నాం. హిందీలో ఆమీర్ఖాన్ ఈ సినిమా చేసే అవకాశముంది’ అని తెలిపారు. దర్శకుడు అహిషోర్ సాల్మన్ మాట్లాడుతూ ‘2007-13 వరకు దేశంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఎన్ఐఏ బృందం చేపట్టిన రహస్య ఆపరేషన్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. దేశాన్ని రక్షించడానికి ఐదుగురు ఎన్ఐఏ అధికారులు సాగించిన అండర్కవర్ ఆపరేషన్ బ్యాక్డ్రాప్లో స్ఫూర్తివంతంగా ఉంటుంది’ అని తెలిపారు. ఈ వేడుకలో జాతీయ పురస్కారాలను అందుకున్న ‘మహర్షి’‘జెర్సీ’ చిత్ర బృందాలను నాగార్జున, నిరంజన్రెడ్డి సన్మానించారు.