భువనేశ్వర్, జూన్ 11: ఒడిశా మాజీ సమాచార కమిషనర్, సేంద్రియ వ్యవసాయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన రాధామోహన్ (78) కన్నుమూశారు. అనారోగ్య కారణాల వల్ల గురువారం రాత్రి భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో ఆయన తుదిశ్వాస విడిచారు. సేంద్రియ వ్యవసాయంపై ఆయన ఎంతగానో కృషిచేశారు. సేంద్రియ వ్యవసాయ రంగానికి రాధామోహన్ చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.