ముంబై: ఇవాళ రోజంతా నష్టాల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి కోలుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ శుక్రవారం ఇంట్రాడే కనిష్ఠాల నుంచి ఏకంగా 650 పాయింట్లు కోలుకుంది. అయినప్పటికీ సూచీలు లాభాలను మాత్రం ఒడిసిపట్టలేకపోయాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ఆసియా మార్కెట్లలో అప్రమత్తత కీలక రంగాల్లో అమ్మకాలకు కారణమయ్యాయి. దీంతో ఉదయం కాస్త సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కొద్దిసేపట్లోనే నష్టాల్లోకి జారుకుని ఇంట్రాడే కనిష్ఠాలను నమోదు చేశాయి. తిరిగి క్రమంగా పుంజుకుని ఫ్లాట్గా ముగిశాయి.
ఉదయం 52,568 వద్ద సానుకూలంగా ప్రారంభమైన సెన్సెక్స్.. ఓ దశలో 51,601 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 21 పాయింట్లు లాభపడి 52,344 వద్ద ముగిసింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 15,761- 15,450 మధ్య కదలాడి చివరకు 8 పాయింట్ల నష్టంతో 15,683 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.73.88 వద్ద నిలిచింది. హెచ్యూఎల్, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా, రిలయన్స్ షేర్లు లాభాల్లో ముగియగా.. ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఎం అండ్ ఎం, నెస్లే ఇండియా, పవర్గ్రిడ్, ఎస్బీఐ, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలు చవిచూశాయి.