రూ.4,546 కోట్ల డీల్
ముంబై, జూన్ 25: ఆన్లైన మెడికల్స్టోర్ ఫార్మ్ఈజీ…డయాగ్నిస్టిక్ సర్వీసుల చైన్ను నిర్వహిస్తున్న థైరోకేర్ టెక్నాలజీని టేకోవర్ చేయనుంది. థైరోకేర్లో 66 శాతం వాటాను రూ.4,546 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ఫార్మ్ఈజీ శుక్రవారం ప్రకటించింది. షేరుకు రూ.1,300 ధర చొప్పున 66.1 శాతం థైరోకేర్ వాటాను ఆ కంపెనీ వ్యవస్థాపకుడైన డాక్టర్ వేలుమణి, సంబంధీకుల నుంచి కొనేందుకు ఒప్పందంపై సంతకాలు చేపినట్లు ఫార్మ్ఈజీ మాతృసంస్థ ఏపీఐ హోల్డింగ్స్ తెలిపింది. చట్ట సంబంధ అనుమతులు లభించినంతనే లావాదేవీ పూర్తవుతుంది. అలాగే ఏపీఐలో డాక్టర్ వేలుమణి 5 శాతం వాటాను తీసుకుంటారు. తన స్థానంలో వ్యాపారాన్ని నిర్వహించేందుకు తగిన వారసత్వ ప్రణాళిక లేకపోవడమే, కంపెనీని వేలుమణి విక్రయించడానికి ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు చెపుతున్నాయి.
26 శాతం షేర్లకు ఓపెన్ ఆఫర్
టేకోవర్ నిబంధనల ప్రకారం అదనంగా 26 శాతం థైరోకేర్ వాటా కోసం పబ్లిక్కు ఏపీఐ ఓపెన్ ఆఫర్ జారీచేస్తున్నట్లు ఏపీఐ సబ్సిడరీ డాకన్ టెక్నాలజీస్ ప్రకటించింది. ఇందుకోసం రూ.1,788 కోట్లు ఖర్చుచేయనుంది. శుక్రవారం ఈ షేరు 6.23 శాతం పెరిగి రూ.1,448 వద్ద ముగిసింది.