ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. ఇవాళ్టి ట్రేడింగ్లో మార్కెట్లు ఆద్యంతం లాభాల్లో కదలాడాయి. ఉదయం 49,066 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 49,801 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 789 పాయింట్ల లాభంతో 49,733 వద్ద ముగిసింది. నిఫ్టీ 211 పాయింట్లు లాభపడి 14,864 వద్ద స్థిరపడింది.
అమెరికా మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు కూడా ఇవాళ సానుకూల ఫలితాలను కనబరుస్తున్నాయి. దేశంలో కరోనా కట్టడికి త్వరితగతిన చేపడుతున్న చర్యలు, వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు మార్కెట్లలో సానుకూలతలను నింపాయి. అలాగే WHO సహా అంతర్జాతీయంగా భారత్కు సహకారం లభిస్తుండడంతో మహమ్మారి విజృంభణకు త్వరలో అడ్డుకట్ట పడే అవకాశం ఉందన్న అంచనాలు కూడా కలిసొచ్చాయి.
వీటికి తోడు కీలక రంగాల సూచీలు, ప్రముఖ కంపెనీలు రాణించడంతో మార్కెట్లు లాభాల్లో కదలాడాయి. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగియగా, బ్రిటానియా, హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, నెస్లే ఇండియా, భారత్ పెట్రోలియం షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఊసరవెళ్లిలా రంగు మారుతున్న మహిళ చేతివేళ్లు..!
గోవాలో రేపట్నుంచి నుంచి కంప్లీట్ లాక్డౌన్..!
కొవిడ్ టీకా వైరస్ సంక్రమణనే కాదు, వ్యాప్తినీ అడ్డుకుంటుందట..!
స్పుత్నిక్-వి టీకాకు అనుమతి నిరాకరించిన బ్రెజిల్..!
ఇండియన్ రెడ్ క్రాస్కు కెనడా ఆర్థిక సాయం..!
ప్రయాణంలోనూ కొవిడ్ పరీక్షలు.. ఇండోర్లో రెండు కేంద్రాలు..!
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో