న్యూఢిల్లీ/ముంబై: కరోనా ‘రెండో’ వేవ్ దేశ ప్రజలతోపాటు స్టాక్ మార్కెట్లను కూడా వణికిస్తున్నది. సోమవారం ప్రారంభం నుంచే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ నష్టాల బాటలో ప్రయాణించాయి.
ప్రధాన షేర్లన్నీ అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో కేవలం 15 నిమిషాల్లో ఇన్వెస్టర్లు రూ.6,86,708.74 కోట్ల సంపద కోల్పోయారు. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1500 పాయింట్లు పతనం కాగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 14,500 పాయింట్లదిగువకు పడిపోయింది.
ఉదయం సెషన్లో సెన్సెక్స్ ఒక దశలో 1479.15 పాయింట్లు కోల్పోయింది. దీంతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.6,86,708.74కోట్లు తగ్గి రూ. 2,02,76,533.13కోట్లకు చేరింది.
ప్రస్తుతం సూచీలు మరింత దిగజారాయి. ఉదయం 11.50 గంటలకు సెన్సెక్స్ 1532 పాయింట్లు పతనమై 48,058 వద్ద, నిఫ్టీ 461 పాయింట్ల నష్టంతో 14,373 వద్ద కొనసాగుతున్నాయి. దీంతో మదుపర్ల సంపద మరింత ఆవిరి కానున్నది.
అత్యధికంగా ఇండస్ఇండ్ బ్యాంక్ ఏడు శాతానికి పైగా నష్టంతో ట్రేడింగ్ అవుతోంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్క్రిప్ట్ కూడా ఏడు శాతం నష్టపోయాయి. ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు షేర్లు కూడా కుంగాయి.
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడ మళ్లీ లాక్డౌన్ విధించే అవకాశాలున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కరోనా ఆంక్షలను కఠినతరం చేయడంతో వ్యాపారాలపై మళ్లీ ప్రభావం చూపుతుందనే భయాలు నెలకొన్నాయి.
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!
బెస్ట్ డైరక్టర్ జావో.. నోమాడ్ల్యాండ్కు నాలుగు బాఫ్టా అవార్డులు
కుంభమేళా.. కొవిడ్ నిబంధనలు పాటించని భక్తులు
బాఫ్టా అవార్డ్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్గా ప్రియాంక చోప్రా, నిక్
కరోనా ఎఫెక్ట్: అక్కడ 18 జిల్లాల్లో లాక్డౌన్
హరిద్వార్లో నిరంజని సాధవుల పుణ్య స్నానాలు
బెడ్ల కొరత.. వీల్ చైర్లపైనే రోగులకు చికిత్స
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!