ఢిల్లీ ,మే 2: డిజిటల్ లావాదేవీలు పెరగడంతో అంటే స్థాయిలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఎవరైనా క్యూఆర్ కోడ్ పంపి డబ్బులుపంపమంటే పంపొద్దనిస్టేట్ బ్యాంక్ ఇండియా(ఎస్బిఐ) కస్టమర్లకు సలహా యిచ్చింది. క్యూఆర్ కోడ్తో పే చేయడానికి షాపుల్లోని క్యూఆర్ కోడ్లు మాత్రమే వాడొచ్చని, డబ్బులు పంపడానికి కాదని తెలిపింది. కరోనా సంక్షోభం వల్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు భారీగా పెరిగాయి. అలానే ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయి. ఆన్లైన్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్లలో ఎక్కువగా క్యూఆర్ కోడ్ల ద్వారానే జరుగుతున్నాయి. దీన్ని మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కస్టమర్లకు క్యూఆర్ కోడ్లు పంపి స్కాన్ చేయాలని అడుగుతున్నారు. స్కాన్ చేస్తే డబ్బులు కొట్టేస్తున్నారు. ‘క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డబ్బులొస్తాయంటారు కాని రావు. స్కాన్ చేస్తే మీ అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయని మెసేజ్ మాత్రమే వస్తుంది. పే చేయడానికి తప్ప ఎవరైనా క్యూఆర్ కోడ్లను పంపితే స్కాన్ చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి’ అంటూ ఎస్బీఐ హెచ్చరించింది.