తెలుగమ్మాయి ఈషా రెబ్బా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఒకవైపు సినిమాలతో అలరిస్తూనే మరోవైపు తన పోస్ట్లతో నెటిజన్స్కి వినోదం పంచుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ట్విట్టర్లో ఓ ఫోటో పోస్ట్ చేయగా, ఇందులో ఎడమ భుజంపై ఎర్రగా కందిన గాయం కనిపిస్తుంది. అది నిజంగా గాయమా లేక ఏదైన మచ్చనా అని అభిమానులు ఆలోచనలో పడ్డారు.
కొంత మంది భుజాలపై వ్యాక్సినేషన్ కారణంగా బొప్పి కట్టిందని అన్నారు. కొందరైతే ఆ మచ్చ మాత్రం వ్యాక్సినేషన్ వల్ల వచ్చినది కాదని కామెంట్ చేస్తున్నారు. అభిమానులలో ఎన్నో డౌట్స్ ఉండగా, వాటికి ఈషానే సమాధానం ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఈషారెబ్బా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో నటించింది. ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. తమిళ్ లో రెండు చిత్రాలు.. మలయాళంలో ఒక సినిమాలో నటిస్తోంది.