అగ్గువకే ఎస్బీఐ గృహ రుణాలు

- ఎస్బీఐ గృహ రుణాలు చౌక
- వడ్డీ రేటులో 30 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ
- మహిళలకు మరో 5 బేసిస్ పాయింట్లు అదనం
- ప్రాసెసింగ్ ఫీజు పూర్తిగా మాఫీ
ముంబై, జనవరి 8: గృహ రుణాలు తీసుకునేవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తీపికబురు అందించింది. వడ్డీ రేటులో 30 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ఆ బ్యాంక్ ప్రకటించింది. అంతేకాకుండా ఈ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కొత్త గృహ రుణాలపై వడ్డీ రేటును సిబిల్ స్కోరు ఆధారంగా నిర్ణయించనున్నట్లు స్పష్టం చేసింది. రూ.30 లక్షల్లోపు గృహ రుణాల వడ్డీ రేటు 6.80 శాతం నుంచి, రూ.30 లక్షలకు మించిన గృహ రుణాల వడ్డీ రేటు 6.95 శాతం నుంచి ప్రారంభమవుతుందని వివరించింది. మహిళా కస్టమర్లకు ఈ వడ్డీ రేటులో అదనంగా మరో 5 బేసిస్ పాయింట్ల రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
ఇండ్ల కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆఫర్ను అందించాలన్న ధ్యేయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశంలోని ఎనిమిది మెట్రో నగరాల్లో మార్చి నెలాఖరు వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, రూ.5 కోట్లలోపు గృహ రుణాలపై వడ్డీ రేటులో 30 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ ఇస్తామని పేర్కొన్నది. ‘యోనో’ యాప్ ద్వారా కస్టమర్లు తమ ఇంటి నుంచే గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇలాంటి వారికి కూడా వడ్డీ రేటులో అదనంగా 5 బేసిస్ పాయింట్ల రాయితీ లభిస్తుందని ఎస్బీఐ స్పష్టం చేసింది.
తాజావార్తలు
- వీడియో : గంటలో 172 వంటకాలు
- ఫలక్నుమాలో భారీగా లభించిన పేలుడు పదార్థాలు
- ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి.. ఇప్పుడిలా..
- క్రేన్ బకెట్ పడి ఇద్దరు రైతుల దుర్మరణం
- మరో కీలక నిర్ణయం : ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు
- ఎలక్ట్రిక్ స్కూటర్పై ఆఫీసుకెళ్లిన సీఎం మమతా బెనర్జీ.. వీడియో
- మహిళా ఐపీఎస్కు లైంగిక వేధింపులు
- సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్
- వెరైటీ డ్రెస్లో ప్రియాంక చోప్రా.. సోషల్ మీడియాలో మీమ్స్తో రచ్చ
- థర్డ్ అంపైర్పై రిఫరీకి ఇంగ్లండ్ ఫిర్యాదు.. ఎందుకు?